బీసీ లకు 50 ఏళ్లకే పెన్షన్, నెలకు రూ.4000 లు : బండారు శ్రావణి శ్రీ
బీసీ లకు 50 ఏళ్లకే పెన్షన్, నెలకు రూ.4000 లు : బండారు శ్రావణి శ్రీ
టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం లో బీసీ లకు 50 ఏళ్ళ కే పెన్షన్, నెలకు రూ.4,000 లు ఇవ్వడం జరుగుతుందని టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలిపారు.
సింగనమల నియోజకవర్గం : సింగనమల మండలంలోని ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి, కొరివిపల్లి, అలంకరాయపేట గ్రామాల యందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగినది.
గ్రామాలలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాల గురించి కర్రపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ బిసి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4000 లు, పెన్షన్ అందించడంతో పెళ్లి కానుక కింద లక్ష రూపాయల సహాయం, బీసీ విద్యార్థుల స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, షరతులు లేకుండా విదేశీ విద్యా పథకం, బీసీ సంరక్షణ చట్టం, శాశ్వతంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, తదితర పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం నందు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బండారు శ్రావణశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.
Mar 23 2024, 07:03